నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
152

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!

మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనం.

ఈ నెల 17 వ తేదీన బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టిన వంట నిర్వహకులు.

బల్లి పడిందని విద్యార్థులు చెప్పితే తినండి ఏమి కాదులే అంటూ నవ్విన వంట సిబ్బంది.

తల్లిదండ్రులకు చెపితే టీసీలు ఇస్తామంటూ విద్యార్థులకు బెదిరింపులు?

బల్లి కాదు,మిడత అంటున్న ప్రిన్సిపల్ !

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, వంట సిబ్బంది చలగాటమాడుతున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తెలిపారు.17 వ తేదీన జరిగిన పరిస్థితిని బయటకు రాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని, ఎండాకాలం సెలవులు సందర్భంగా ఈరోజు బయటికి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి తమ పరిస్థితిని వివరించారని తెలిపారు. ఉన్నత అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పైన, వంట సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంవలన 200 మంది విద్యార్తులు విష ఆహరం తిన్నతరువాత వాంతులు చేసుకొవడం జరిగింది. ఎంతో గౌరవంతో హాస్టల్ మీద నమ్మకంతో పేద కుటుంభంనుండి వచ్చిన విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించక అభద్రతా భావంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్ధులు చాలా అవస్తలు పడుచున్నారు. విష ఆహరం వలన విద్యార్థులకు ఎదయినా జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఒక బాధ్యతాయుత అధికారిగా ఉండి విద్యార్థుల విషయంలొ ప్రతి విషయంలోను నిర్లక్ష్యంచేస్తూ విద్యార్ధులపాలిట శాపంగా మారిన కేజీబీవీ ప్రిన్సిపల్ మీద శాఖాపరమైన విచారణ చేసి తక్షణమే విధులనుండి సస్పండ్ చెయ్యాలని ఈ విషయంపై రాబొయే సొమవారం బిజెపి జనతా వారిది PGRS కార్యక్రమంలో తగిన ఆధారాలతో జిల్లా కలెక్టరు గారికి పిర్యాదుచేస్తామని తెలిపారు. 

ప్రిన్సిపల్ గారికి ఈ విషయంపై అరా తియ్యగా ఆ రోజు పడింది బల్లి కాదు, మిడత అంటూ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు మాత్రం మిడత కాదు బల్లి పడిందని ఫోను ద్వారా తమకు తెలిపారన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...
By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 26
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 174
Andhra Pradesh
ఎస్పీ కార్యాలయంలో నారాయణాచార్యులు జయంతి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఘనంగా...
By Manda Ramkumar 2026-03-28 09:23:46 0 429
Jharkhand
Digital Health Boost: State Hospitals to Get Fully Auto-Labs
The Jharkhand Health Department is taking a giant leap toward modernization. Additional Chief...
By Dunna Jessicaruth 2026-05-15 09:55:43 0 85
Business & Finance
Upgrading Your Pan 2.0 is now Quick and Simple
Upgrading to PAN 2.0 is now quick and simple! With Aadhaar-linked features and enhanced digital...
By Business EDGE 2025-05-27 04:55:04 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com