అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

0
65

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్

రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం

ఏప్రిల్ 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి పైగా ఉపాధి అవకాశాలు

ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ ప్లాంట్‌ను, మరో రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను రీన్యూ నిర్మించనుంది. కేవలం 24 నెలల రికార్డు సమయంలోనే ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ తయారీకి అత్యంత కీలకమైన ఇంగోట్స్, వేఫర్లను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సోలార్ సరఫరా రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. 2015 నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న రీన్యూ, ఇప్పటికే అనంతపురం జిల్లాలో రూ. 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. తాజా ప్రాజెక్టుతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో అనకాపల్లి పారిశ్రామిక ముఖచిత్రం మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు...
By Sidhu Maroju 2025-11-28 07:28:04 0 158
Andhra Pradesh
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
By G k Nookala 2026-05-18 13:01:07 0 39
Andhra Pradesh
వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-05-14 05:44:36 0 46
Telangana
"ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.|
హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య...
By Sidhu Maroju 2026-05-11 11:50:05 0 184
Telangana
రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ...
By Nookapangu Manikanta 2026-05-07 12:56:15 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com