ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ.

0
106

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట

ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు

నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు

ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి

అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్‌టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది.

 

ఇళ్లు లేదా వాణిజ్య భవనాలు నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ, నిర్మాణ కాలంలో అధికారులు మళ్లీ ఖాళీ స్థలం పన్ను విధించడం ప్రజలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ పన్నును సగానికి తగ్గించాలని నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి పొందిన రోజు నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే వరకు లేదా అనుమతి గడువు ముగిసే వరకు (వీటిలో ఏది ముందైతే అది) ఈ 50 శాతం పన్ను తగ్గింపు వర్తిస్తుంది. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టే అక్రమ నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తించదని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

 

ఈ పన్ను తగ్గింపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు అధికారిక జీవోను విడుదల చేసింది. వాస్తవానికి వీఎల్‌టీ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు ఏటా సుమారు రూ.60 కోట్ల ఆదాయం సమకూరేది. తాజా తగ్గింపుతో ఈ ఆదాయం రూ.30 కోట్లకు పరిమితం కానుంది. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పన్నును తగ్గించాలని నిర్ణయించి జీవో ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే నిర్ణయాన్ని అమలు చేస్తుండటంతో నిర్మాణ రంగంలో ఉన్న వారికి, సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భారీ ప్రయోజనం చేకూరనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-03-25 05:58:38 0 237
Andhra Pradesh
ఓటర్ జాబితా సవరణ పై సీఎం చంద్రబాబు కీలక భేటీ
*ఓటరు జాబితా సవరణపై సీఎం చంద్రబాబు గారు కీలక భేటీ*   గుంటూరు జిల్లా, మంగళగిరి, టీడీపీ...
By Rajini Kumari 2026-06-02 12:36:30 0 221
Andhra Pradesh
రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?
చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల  పనులు 3.10 కోట్లు మంజూరు...
By Shyamala Yadagiri 2026-04-04 03:51:22 0 267
Andhra Pradesh
BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-01-31 06:10:24 0 155
Telangana
Strict Action for Violation of Election Code: District SP Smt. Sneha Mehra, IPS*
In view of the Municipal Elections in the four municipalities of Vikarabad District, the District...
By Terli Ashok 2026-01-31 05:16:24 0 506
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com