గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*

0
184

నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే బాలుడు కనబడటం లేదు అని తల్లిదండ్రులు చందోలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పిర్యాదు స్వీకరించిన వెంటనే ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు, డీఎస్పీ, సీఐ అదేశాల మేరకు ఆచూకీ కోసం ఎస్ ఐ శివకుమార్ వారి సిబ్బంది తో తీవ్రంగా రేయంబవళ్లు శ్రమించారు. కష్టానికి తగిన ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానం తో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. దీనికి ప్రధాన కారణం ఎస్ ఐ వివరణ ప్రకారం బాలుడు తన తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వమని అడగగా నిరాకరించారు. దీనితో మనస్తాపం చెంది నాగ సాయి కొంత సొమ్ము తో టికెట్ కొని మద్రాస్ రైల్ ఎక్కి పారిపోయాడు.సాంకేతిక పరిజ్ఞానం తో కనుగొనగా చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. ఇంత తక్కువ సమయం లో కష్టపడి తన అనుభవం తో కేస్ ను ఛేదించినఎస్ ఐ శివకుమార్ ను బాలుడి తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు.అసలు చందోలు పోలీస్ స్టేషన్ లో ఇప్పటి ఎస్ ఐ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎన్నో కేస్ లు ఛేదించి అందరి చేత మన్ననలు పొందారు. అంతే కాకుండా తమ శాఖ గురించి ప్రజలకు అవగాహన కలిపించటం కోసం నిత్యం కఠోర శ్రమతో ఉద్యోగ బాధ్యతలు చేస్తూ నేరగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అని ప్రజల్లో జోరుగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి.ప్రతి ఒక్కరికి ఎస్ ఐ అంటే కుటుంబసభ్యుడిలా ఉంటూ తనదైన శైలి లో ముందుకు సాగుతూ తన సిబ్బందిని కూడా నిబద్దత తో ఉద్యోగం చేయించడం ఆయన పని తీరుకు దర్పణం పడుతుంది. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలి అని ప్రతి ఒక్కరి కోరిక.దీనికి ప్రధాన కారణం ఈ స్థాయిలో ఇంత నిబద్దత తో ఉద్యోగం చేస్తూ ఉంటే ఉన్నత స్థాయి లభిస్తే ఇంకా ఎన్నో పనులు చేసి అందరి మన్ననలు పొందుతారని అందరి భావన..

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 16
Andhra Pradesh
మెప్మా బజారున ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ...
By Hari Krishna 2026-01-26 08:30:10 0 378
Telangana
నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి....
By Gujile Ramu 2026-04-28 16:01:57 0 190
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 81
Telangana
జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ...
By Ponnala Srinivasrao 2026-04-21 01:13:43 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com