పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.

0
64

 

పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం

 Andhra

Mrithyunjaya Homam on April 21st for the health of AP Deputy CM Pawan Kalyan

చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు

శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం

పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు

ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం జరగనుంది.

 

రేపు (ఏప్రిల్ 21) మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

 

ఈ హోమానికి అవనిగడ్డ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం...
By Kothuru Murali 2026-03-23 04:51:05 0 127
Andhra Pradesh
రాజధాని గ్రామం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన
అమరావతి...   *రాజధాని గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటన*   *మంత్రి నారాయణ కు...
By Rajini Kumari 2025-12-22 07:39:17 0 195
Telangana
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
By Sidhu Maroju 2026-03-28 06:16:08 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com