కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!

0
81

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

‎రైతుభరోసా పంపిణీ చేయకపోవడంపై కచ్చితంగా కేసీఆర్‌ ఈ సభ సాక్షిగా ప్రశ్నిస్తారని, రైతుల తరఫున నిలదీస్తారని రేవంత్‌ సర్కార్‌కు అవగతమైంది. దీంతో నిన్నమొన్నటి దాకా నిధులే లేవంటూ రైతుభరోసా రెండో విడతను వాయిదావేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్‌ సభ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధులు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. మొత్తం 45.11 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను...
By Pagadala Venkateswar 2026-04-16 03:24:26 0 93
Andhra Pradesh
TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఈ నెల 19న ఉగాది పర్వదినం ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం 17న బ్రేక్...
By Pagadala Venkateswar 2026-03-05 13:05:53 0 109
Andhra Pradesh
పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు.
  పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు  Andhra...
By Pagadala Venkateswar 2026-04-20 03:42:14 0 71
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com