విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన

0
86

*ప్రచురణార్థం*

ది:19-04-2026

 

*వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని మరియు ఎమ్మెల్యే బోండా ఉమ*

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

 

నిరుపేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు తన ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుండి కేటాయించిన రూ. 75 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారితో కలిసి ఈరోజు ఘనంగా శంకుస్థాపన చేశారు. 

 

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

 

పేద క్రైస్తవ సోదరులు మరియు బడుగు బలహీన వర్గాల సామాజిక అవసరాలను గుర్తించి, పోస్టర్స్ అసోసియేషన్ విన్నపం మేరకు ఎంపీ కేశినేని చిన్ని గారు తక్షణమే స్పందించి తన ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా ఈ భారీ మొత్తాన్ని కేటాయించారు. ఈ నిధులతో నిర్మించబోయే క్రిస్టైన్ కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక నిరుపేదలు తమ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు మరియు ప్రార్థనలను అతి తక్కువ ఖర్చుతో గౌరవప్రదంగా నిర్వహించుకోవడానికి వీలవుతుందని ఎంపీ గారు తెలిపారు.

 

విజయవాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని, కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల కొరత లేకుండా ప్రతి గడపకూ అభివృద్ధి ఫలాలు అందజేస్తామని నేతలు స్పష్టం చేశారు. 

 

ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు పునరుద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కంచి దుర్గ, టీడీపీ సీనియర్ నాయకులు నవనీతం సాంబశివరావు, క్లస్టర్ ఇంచార్జి కంచి ధనశేఖర్,డివిజన్ ప్రెసిడెంట్ బెవర సూరి, నాగరాజు కూటమి పార్టీల నాయకులు, పోస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గాబేరియాల్,రత్నబాబు ,ఆదిబాబు,వాసు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై మార్కుల జాబితాల్లో ఆ మార్కులు చేరుస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల...
By John Baji 2025-12-30 12:35:59 0 141
Andhra Pradesh
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...
By Kothuru Murali 2026-05-24 17:39:08 0 13
Andhra Pradesh
ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్...
By Vadlamudi NagaVenkat 2026-04-18 07:22:52 0 168
Andhra Pradesh
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
By SivaNagendra Annapareddy 2025-12-15 05:28:12 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com