*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*

0
175

ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు.

శుక్రవారం ఏప్రిల్ 17 వ తేదీన బాపట్ల పట్టణం విజయలక్ష్మి పురంలోని మాజీ సైనికుల రాష్ట్ర కార్యాలయం లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ఆదివారం బాపట్లలో మొట్టమొదటి సారి జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ముఖ్య అతిధులుగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ను,బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ను, బాపట్ల జిల్లా కలెక్టర్ ,మేజిస్ట్రేట్ వి వినోద్ కుమార్ ను, మాజీ శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ను, స్టేట్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సత్య ప్రసాద్ ను,జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణ షీలా ను ఆహ్వానించినట్లు తెలియ జేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు, మాజీ సైనికులు పాల్గొని భవిష్యత్తులో మాజీ సైనికుల సంక్షేమం కోసం తీసుకోవలసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి తగు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.

కార్యక్రమంలో పుట్ట ఆదిశేషరెడ్డి, స్టేట్ కమిటి గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, దూళ్ళ వెంకటేశ్వర్లు, రుక్మదరరావు, కె నాగరాజు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 109
Andhra Pradesh
ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
By Pagadala Venkateswar 2026-02-24 07:38:54 0 120
Telangana
భార్య సర్పంచ్ అయితే భర్తల పెత్తనం దేనికి.?
హైదరాబాద్ :  మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా? ఈసారి...
By Sidhu Maroju 2025-12-23 11:29:02 0 179
Telangana
తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణ
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో...
By Vangari Praveen 2026-05-01 09:51:32 0 349
Andhra Pradesh
విజయవాడ రైల్వే మౌలిక వసతులు అభివృద్ధిపై MP కేశినేని శివనాద్కృషి
*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*   విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ...
By Rajini Kumari 2025-12-18 11:47:52 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com