*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*

0
177

ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు.

శుక్రవారం ఏప్రిల్ 17 వ తేదీన బాపట్ల పట్టణం విజయలక్ష్మి పురంలోని మాజీ సైనికుల రాష్ట్ర కార్యాలయం లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ఆదివారం బాపట్లలో మొట్టమొదటి సారి జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ముఖ్య అతిధులుగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ను,బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ను, బాపట్ల జిల్లా కలెక్టర్ ,మేజిస్ట్రేట్ వి వినోద్ కుమార్ ను, మాజీ శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ను, స్టేట్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సత్య ప్రసాద్ ను,జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణ షీలా ను ఆహ్వానించినట్లు తెలియ జేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు, మాజీ సైనికులు పాల్గొని భవిష్యత్తులో మాజీ సైనికుల సంక్షేమం కోసం తీసుకోవలసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి తగు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.

కార్యక్రమంలో పుట్ట ఆదిశేషరెడ్డి, స్టేట్ కమిటి గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, దూళ్ళ వెంకటేశ్వర్లు, రుక్మదరరావు, కె నాగరాజు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: తాసిల్దార్ పై అవినీతి ఆరోపణలు
మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-04-06 04:14:18 0 126
West Bengal
West Bengal's New Industrial Policy: ₹50,000 Crore Investment, Focus on Green Energy and IT
Major Policy: The West Bengal government has announced a new industrial policy to boost its...
By Triveni Yarragadda 2025-08-11 14:45:53 0 1K
Andhra Pradesh
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 
బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు...
By Gadiyapudi Narendra 2026-01-07 13:49:34 0 196
Andhra Pradesh
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడ   *వైసిపి అధినేత వైఎస్ జగన్ :*   25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు...
By Rajini Kumari 2025-12-16 10:15:44 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com