పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం

0
214

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ, పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు. వాటిని చూడగానే మనిషి ప్రవర్తన మారిపోతుంది. కానీ, కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు. పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆత్మాభిమానంతో ఉంటారు.

తాజాగా, అలాంటి సంఘటన గురువారం సాయంత్రం నందిగామ శివారు గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది 

నందిగామ మండలం రాగాపురం నివాసి రుద్రవరం గొర్రెలు కొనడానికి వెళ్లి వస్తూ ఉండగా లక్ష రూపాయల బ్యాగును పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి బ్యాగు లేకపోయేసరికి ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలియక బాధపడుతూ ఉన్నాడు.

కానీ ఆ రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి శివాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న తొర్లపాటి సాయిరాం కు 1 లక్ష రూపాయలు బ్యాగు రోడ్డుపై  దొరికింది.

వెంటనే అర్చకులు సాయిరాం గొల్లమూడి శివాలయం గ్రూపులో ఈ సమాచారాన్ని అందించారు సమాచారం తెలుసుకున్న బాధితులు గొల్లమూడి శివాలయం అర్చకుల్ని సంప్రదించారు.

శుక్రవారం ఉదయం నందిగామ వినాయకుడి గుడి అర్చకులు ప్రధాన అర్చకులు ఐతపు రఘు శర్మ బాధితులని నందిగామకు పిలిపించి నందిగామ పట్టణ సిఐ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలపగా పట్టణ సీఐ ఆదేశాల మేరకు నందిగామ వినాయకుడు ఆలయంలో చైర్మన్ తిరుపతిరావు ఆధ్వర్యంలో గొల్లమూడి శివాలయం ప్రధాన అర్చకులు చేతుల మీదుగా పోగొట్టుకున్న సొమ్ము నగదు 1 లక్ష రూపాయలు రాఘవపురం నివాసి అయిన వరద పైన మురళీకృష్ణ కు అప్పగించారు.

 

పోయిందనుకున్నా లక్ష రూపాయలు సొమ్ము తిరిగి వచ్చేసరికి అర్చకులు సాయిరాం నిజాయితీకి ఫిదా అయ్యాడు. నందిగామ పాత బస్టాండ్ వినాయకుడి గుడి ఆలయంలో భక్తులంతా సన్నివేశాన్ని చూసి సాయిరాం నిజాయితీకి ప్రశంసలు కురిపించారు.

Search
Categories
Read More
Manipur
Manipur Security Challenges and Ethnic Tensions Update
Manipur continues to face security challenges amid ongoing ethnic tensions among various...
By Fathima Safa 2026-06-24 10:36:50 0 116
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభ
చౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి...
By Kothuru Murali 2026-04-08 09:32:31 0 116
Andhra Pradesh
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి...
By Ratna Sekhar 2026-02-19 19:15:11 0 2K
Andhra Pradesh
మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై...
By Pagadala Venkateswar 2026-03-21 06:07:23 0 169
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Disaster Management Systems
Madhya Pradesh continues to strengthen its disaster management framework through improved...
By Fathima Safa 2026-07-02 09:26:51 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com