పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం

0
183

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ, పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు. వాటిని చూడగానే మనిషి ప్రవర్తన మారిపోతుంది. కానీ, కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు. పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆత్మాభిమానంతో ఉంటారు.

తాజాగా, అలాంటి సంఘటన గురువారం సాయంత్రం నందిగామ శివారు గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది 

నందిగామ మండలం రాగాపురం నివాసి రుద్రవరం గొర్రెలు కొనడానికి వెళ్లి వస్తూ ఉండగా లక్ష రూపాయల బ్యాగును పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి బ్యాగు లేకపోయేసరికి ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలియక బాధపడుతూ ఉన్నాడు.

కానీ ఆ రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి శివాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న తొర్లపాటి సాయిరాం కు 1 లక్ష రూపాయలు బ్యాగు రోడ్డుపై  దొరికింది.

వెంటనే అర్చకులు సాయిరాం గొల్లమూడి శివాలయం గ్రూపులో ఈ సమాచారాన్ని అందించారు సమాచారం తెలుసుకున్న బాధితులు గొల్లమూడి శివాలయం అర్చకుల్ని సంప్రదించారు.

శుక్రవారం ఉదయం నందిగామ వినాయకుడి గుడి అర్చకులు ప్రధాన అర్చకులు ఐతపు రఘు శర్మ బాధితులని నందిగామకు పిలిపించి నందిగామ పట్టణ సిఐ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలపగా పట్టణ సీఐ ఆదేశాల మేరకు నందిగామ వినాయకుడు ఆలయంలో చైర్మన్ తిరుపతిరావు ఆధ్వర్యంలో గొల్లమూడి శివాలయం ప్రధాన అర్చకులు చేతుల మీదుగా పోగొట్టుకున్న సొమ్ము నగదు 1 లక్ష రూపాయలు రాఘవపురం నివాసి అయిన వరద పైన మురళీకృష్ణ కు అప్పగించారు.

 

పోయిందనుకున్నా లక్ష రూపాయలు సొమ్ము తిరిగి వచ్చేసరికి అర్చకులు సాయిరాం నిజాయితీకి ఫిదా అయ్యాడు. నందిగామ పాత బస్టాండ్ వినాయకుడి గుడి ఆలయంలో భక్తులంతా సన్నివేశాన్ని చూసి సాయిరాం నిజాయితీకి ప్రశంసలు కురిపించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-27 04:16:37 0 126
Andhra Pradesh
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు    ...
By Rajini Kumari 2025-12-29 13:11:37 0 146
Andhra Pradesh
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
మీడియా పాయింట్...  పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..   ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-14 15:05:42 0 175
Telangana
గాంధీ ఆసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్ .|
       హైదరాబాద్ : (భారత్ ఆవాస్ ప్రతినిధి)  ఆసిఫాబాద్ కు చెందిన...
By Sidhu Maroju 2026-01-21 09:53:45 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com