ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

0
168

ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి సోమన్న, యస్.షాబీర్ భాష మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అడ్మిషన్ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు కొన్ని విద్యా సంస్థలు అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకున్నా ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారు మరోవైపు నగరంలో పెద్ద పెద్ద ప్రచార బోర్డులు పెట్టి, ప్రధాన కూడలిలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ప్రచారాలు నిర్వహిస్తూ వీఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వా నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు నిదర్శనం అన్నారు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్లకిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు , ఇప్పటికైనా ప్రభుత్వ నియామ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సి. అశోక్, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 109
Andhra Pradesh
మార్చి31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక...
By Chennaiah Kati 2026-02-09 04:54:02 0 254
Assam
Assam Boosts Tribal and Indigenous Welfare Programs
Assam has strengthened its focus on tribal and indigenous welfare through targeted development...
By Fathima Safa 2026-07-01 05:39:23 0 85
Andhra Pradesh
Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు   కేవలం భక్తులుగా కాకుండా ధర్మ...
By Pagadala Venkateswar 2026-02-06 14:19:38 0 186
Business & Finance
Remove Directors with Smooth Legal Compliance Process
Removing a director from a company requires following the legal procedure prescribed under the...
By Navya Sree 2026-07-23 05:14:52 0 11
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com