ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.

0
74

ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

11-04-2026 Sat 07:08 | Andhra

APSRTC Announces Mandatory Health Checkups for Employees Over 45

షార్ట్స్‌లో చూడండి

ఏపీఎస్‌ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలతో ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరగడంతో నివారణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధన మే 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అమల్లోకి రానుంది.

 

గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేవలం 11 నెలల వ్యవధిలోనే 272 మంది ఆర్టీసీ ఉద్యోగులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 100 మంది గుండె జబ్బులతో, 62 మంది కాలేయ సంబంధిత వ్యాధులతో, మిగిలిన వారు క్యాన్సర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగుల వరుస మరణాలు యాజమాన్యాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేయడంతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.

 

కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రివెంటివ్ (ముందస్తు) వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఇతర విభాగాలు, వర్క్‌షాపులలో పనిచేస్తున్న 45 ఏళ్లు పైబడిన సిబ్బందికి ఏడాదికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఎన్. బాలసుబ్రమణ్యం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

గతంలో కేవలం డ్రైవర్లకు మాత్రమే వైద్య పరీక్షల నిబంధన ఉండేది. వారికి కూడా 45 ఏళ్ల వరకు మూడేళ్లకోసారి, ఆ తర్వాత పదవీ విరమణ వరకు ఏడాదికోసారి మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఇతర సిబ్బందికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. అయితే, తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి వ్యవసాయ శాఖ అచ్చం నాయుడు నాయుడు
*Press Release*     *ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి జ‌గ‌న్ వ్య‌తిరేకి*...
By Rajini Kumari 2026-01-05 12:01:25 0 257
Andhra Pradesh
ఏపీలో కొత్త జనాభా రాజకీయాలు – భవిష్యత్ ప్రణాళికా? రాజకీయ వ్యూహమా?
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రకటించిన జనాభా ప్రోత్సాహక పథకం ఇప్పుడు రాష్ట్ర...
By Babitha Babitha 2026-05-21 13:12:56 0 31
Andhra Pradesh
పారిశ్రామికవేత్తలకు ప్రముఖులకు ఎంపీ కేసినేని శివనాద్ పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   ఎన్టీఆర్ జిల్లాను పేద‌రికం లేని జిల్లాగా...
By Rajini Kumari 2025-12-22 07:34:38 0 146
Andhra Pradesh
కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ
పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ...
By Kothuru Murali 2026-01-02 13:12:37 0 159
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:31:31 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com