బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్

0
145

వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. సినిమా సెట్లలో సైతం వేములవాడ చరిత్ర వైభవాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు తెలియజేస్తారని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు...
By Kothuru Murali 2026-04-10 04:45:30 0 71
Telangana
బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత...
By Vadla Egonda 2025-06-21 01:34:05 0 1K
Dadra &Nager Haveli, Daman &Diu
Digital Census Phase Underway
The Union Home Ministry confirmed that house-to-house operations for Phase 1 of Census 2027 are...
By Dunna Jessicaruth 2026-05-20 11:39:36 0 53
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bittu Bittu 2025-12-22 16:41:55 0 340
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com