ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

0
110

*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి* 

 

*జేసీకి బీజేపీ నాయకుల వినతి* 

 

వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 10: నిజాంపేట పరిధిలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి ప్రజా అవసరాలకు వినియోగించాలని బీజేపీ నాయకులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సంయుక్త కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

బాచుపల్లి మండలం, నిజాంపేట సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్లు 233/22 నుంచి 233/27 వరకు ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, ఆ ప్రాంతంలో మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో జేసీ విజయేందర్ రెడ్డిని కలిసి కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్వే నంబర్ 233 పరిధిలో ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలకు గురైందని ఆరోపించారు. 233/22 నుంచి 233/27 వరకు సుమారు 14 ఎకరాలకు పైగా ఉన్న భూమి కూడా కబ్జాలకు గురవుతోందని తెలిపారు. కొందరు స్థానిక నాయకుల అండదండలతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ షాపులు నిర్మించి అద్దెల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గతంలో డ్రైవ్-ఇన్ హోటల్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టగా మున్సిపల్ అధికారులు కూల్చివేసినా, మళ్లీ అదే నిర్మాణం పునరుద్ధరించారని పేర్కొన్నారు. సర్వే నంబర్లు 82, 83, 84, 85లో అంబేద్కర్ భవన్, డిజిటల్ లైబ్రరీ, శ్రీకృష్ణ భవన్, పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సర్వే నంబర్ 340, 341, 342, 346, 347, 348, 332, 334, 95, 96, 97, 103, 105, 109 సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు స్పందించిన జేసీ విజయేందర్ రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిక్షపతి యాదవ్, శ్రీనివాస్ గుప్తా, ఎన్.ఆర్.కే ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు...
By Benguluri Madhubabu 2026-01-17 06:39:31 0 290
Andhra Pradesh
ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి
కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి...
By Boiena Rajesh 2026-02-28 14:37:49 0 176
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 12:12:06 0 290
Andhra Pradesh
లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు- సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు అర్థమయ్యేలా*: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్...
By John Baji 2026-02-05 02:38:10 0 301
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-31 05:53:21 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com