టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్

0
90

ప్రచురణార్థం. 10/4/2026

టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల రూపాయలు కట్టుకునేందుకు కేటాయించాలి కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ డిమాండ్

 

కెవిపిఎస్. సిఐటియు .ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 

బాధితులతో దరఖాస్తులు పూర్తి చేయించే కార్యక్రమం చేపట్టారు

 

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రెండు సెంట్లు భూమి. 

 

డబ్బు కట్టించుకొని ఈనాటికి అర్హులకు దక్కని టిక్కో ఇల్లు. 

 

పెండింగ్లో ఉన్న పెన్షన్లు కొత్త పెన్షన్లు. మంజూరు చేయాలని

 

ఇల్లు పట్టాల. రిజిస్ట్రేషన్లు. సమస్య లను పరిష్కరించాలని అర్జీలు శాంతినగర్ ప్రాంతంలో వ్రాయించటం జరిగినది

 

అర్జీదారులను ఉద్దేశించి

*శ్రీనివాస్* మాట్లాడుతూ

సోమవారం 13/4/ 26 ఉదయం10 గంటలకు విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కు

సామాజిక దరఖాస్తుల రాయబారం అర్జీల అందజేత కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

 

61వ డివిజన్ దేవినేని గాంధీ పురం. శాంతినగర్ లో

ఇల్లు పట్టాలు పెన్షన్ల సమస్యల లబ్ధి దారులతో 

మాట్లాడి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకోవడం జరిగింది

 

  గత 40 సంవత్సరములుగా నివాసం ఉంటున్న దేవినేని గాంధీ పురం ఎస్టి ఎస్సి ఇతరులు నివసిస్తున్న ప్రాంతంలో ప్రతి ఎన్నికల సందర్భంలో టిడిపి కూటమి వైసిపిలు రిజిస్ట్రేషన్లతో కూడిన పట్టాలు ఇస్తామని వాగ్దానాలు చేయటం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత వాసుల  

మొరని పట్టించుకోకపోవడం గర్హనీయం 

 

నివాస ప్రాంతాలకు చుట్టుపక్కన ఆనుకుని ఉన్న

  చెరువు స్థలాన్ని విడగొట్టి రిజిస్ట్రేషన్ తో కూడిన పట్టాలి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరారు

 

 

 శాంతినగర్ ఇతర ప్రాంతాలలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పేదవాళ్లు ఇల్లు లేక అద్దెలు కట్టలేక చాలీచాలని జీతాలతో చాలా ఇబ్బందులతో 

జీవనం గడుపుతున్న పరిస్థితి

 

చేతివృత్తులు కూలి పనులు ఆటో బిల్డింగ్ చెప్పులు కంపెనీలలో పని చేసే కార్మికులు

బొబ్బట్ల తయారీ కంపెనీలు పనిచేసే కార్మికులు తోపుడు బండ్ల పైన సామల అమ్ముకునేవారు ఇళ్లల్లో పనిచేసే మహిళలు అధికంగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో వచ్చే ఆదాయం చాలక ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అద్దెదారులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేశారు

 

టిడిపి కూటమి ప్రభుత్వం

 ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి

 

నిరుపయోగముగా ఉన్నఖాళీ ప్రభుత్వ స్థలం

వాంబే కాలనీ 57 ఎకరాలు ఇతర ఖాళీ స్థలాలలో రెండు సెంట్లు భూమి కేటాయించి నిర్మాణ పనులు గాను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

 

అర్జీదారులందరూ

ఈనెల 13వ తేదీ సోమవారం జిల్లాకలెక్టర్ కార్యాలయంలొ తమ అర్జీలు అందజేయవలసిందిగా కోరారు

 

ఈ కార్యక్రమంలో 

  చింతల శ్రీనివాస్ తో పాటు ఐద్వా డివిజన్ కార్యదర్శి ch అరుణ. సిఐటియు నాయకులు జి రాంబాబు. వి .మహేష్. ఎస్ .వెంకటేశ్వరరావు. స్థానిక కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ
కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో రేషన్ కార్డుదారులకు కొడుమూరు నియోజవర్గ ఎంఎల్ఏ బొగ్గుల...
By mahaboob basha 2025-09-30 10:45:16 0 277
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)* • ఉదయం 10.15 గంటలకు...
By Rajini Kumari 2025-12-16 08:38:10 0 149
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 250
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 116
Andhra Pradesh
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...
By Boiena Rajesh 2026-03-09 14:26:34 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com