వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం

0
422

  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్ యంత్రాంగంతో 19వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు & స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్ గారు..ఈ సందర్భంగా వారు గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంచినీటి, డ్రైనేజ్,పారిశుద్ధ వ్యవస్థను పర్యవేక్షించి..అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు..

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.

- మున్సిపల్ సిబ్బంది సైడ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను & రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని,పారిశుద్ధం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు..- 19వ వార్డులో నీటి సౌకర్యాన్ని పరిశీలించి..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోర్లు వేయించడం జరిగిందని వాటికి మోటర్లు కూడా అమర్చడం జరిగిందని..వేసవికాలంలో వార్డులోని ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా & ఇబ్బందుల తలెత్తకుండా చూస్తామని "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం చేస్తున్నామని అన్నారు..అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత,వంట గదుల శుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలను వారు పర్యవేక్షించారు..

- పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌష్టికాహారం,స్వచ్ఛమైన నీటిని అందించాలని పారిశుద్ధ్యం లోపించకూడదని అంగన్వాడి సిబ్బందికి సూచించారు..

- పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం మరియు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

- నర్సంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డులోనీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 20వ కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి,మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్,వార్డు జవాన్,మున్సిపల్ సిబ్బంది,19వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
నాచెక్ ఎటుపాయె..!
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?  మరోసారి చెక్కుల లీకేజీ కలకలం! మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు...
By Bittu Bittu 2026-05-24 12:37:37 0 94
Andhra Pradesh
చిత్తూరు జిల్లా వీకోట : దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య
ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను...
By Pagadala Venkateswar 2026-04-28 05:02:18 0 70
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com