వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం

0
622

  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్ యంత్రాంగంతో 19వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు & స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్ గారు..ఈ సందర్భంగా వారు గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంచినీటి, డ్రైనేజ్,పారిశుద్ధ వ్యవస్థను పర్యవేక్షించి..అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు..

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.

- మున్సిపల్ సిబ్బంది సైడ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను & రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని,పారిశుద్ధం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు..- 19వ వార్డులో నీటి సౌకర్యాన్ని పరిశీలించి..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోర్లు వేయించడం జరిగిందని వాటికి మోటర్లు కూడా అమర్చడం జరిగిందని..వేసవికాలంలో వార్డులోని ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా & ఇబ్బందుల తలెత్తకుండా చూస్తామని "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం చేస్తున్నామని అన్నారు..అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత,వంట గదుల శుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలను వారు పర్యవేక్షించారు..

- పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌష్టికాహారం,స్వచ్ఛమైన నీటిని అందించాలని పారిశుద్ధ్యం లోపించకూడదని అంగన్వాడి సిబ్బందికి సూచించారు..

- పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం మరియు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

- నర్సంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డులోనీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 20వ కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి,మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్,వార్డు జవాన్,మున్సిపల్ సిబ్బంది,19వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-20 12:01:46 0 192
Andhra Pradesh
డ్వాక్రా మహిళలకు ఆర్థిక ప్రగతికి బాటలు వేసాం
*డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశాం*   *సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా...
By Rajini Kumari 2026-01-09 10:24:27 0 171
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 44
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 170
Andhra Pradesh
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్...
By Ratna Sekhar 2026-02-19 20:08:35 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com