"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|

0
178

సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాట్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్ రెడ్డి, తన దురవాట్లు మరియు కుటుంబ అవసరాల కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నెల 2, 3 తేదీలలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు . 

అతని కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
ప్రకటన  ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం  ...
By Rajini Kumari 2026-03-14 11:41:59 0 166
Telangana
అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు...
By Ponnala Srinivasrao 2026-05-12 00:01:32 0 71
Andhra Pradesh
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్...
By Gadiyapudi Narendra 2026-03-02 13:47:56 0 197
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర...
By Pagadala Venkateswar 2026-05-10 05:49:08 0 56
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-08 00:46:48 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com