"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|

0
275

సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాట్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్ రెడ్డి, తన దురవాట్లు మరియు కుటుంబ అవసరాల కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నెల 2, 3 తేదీలలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు . 

అతని కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
శీర్షిక: సైబర్ నేరాల పట్ల అప్రమత్తం: ప్రజలకు పోలీస్ అవగాహన
వివరణ: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు...
By Kalaga Sailaja 2026-06-25 05:41:59 0 59
SURAKSHA
Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో...
By Kalaga Sailaja 2026-07-03 10:46:16 0 47
Andhra Pradesh
పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు
పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని...
By Chennaiah Kati 2026-07-03 09:52:31 0 43
SURAKSHA
Usha Padhee IAS: Driving Odisha's Vision with Excellence
A distinguished 1996-batch Odisha cadre IAS officer, Usha Padhee has transformed governance...
By Kalaga Sailaja 2026-07-21 10:42:43 0 25
Andhra Pradesh
స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్రతో కళాశాల ప్రాంగణం మెరిసింది
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ Dr.S.K. అన్నార్ ఆదేశాల మేరకు NSS కోఆర్డినేటర్ T....
By Kothuru Murali 2026-06-20 15:28:53 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com