దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు

0
80

*ప్రచురణార్థం*

02.04.26

 

*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*

 

*యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*

 

 *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*

 

 *సానుకూలంగా స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ* 

 

*న్యూఢిల్లీ/ విజయవాడ* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభ లో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. 

 

యువనేత, రాష్ట్ర విద్య - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.

 

 ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు 

 

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు. 

 

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. 

 

దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

Search
Categories
Read More
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 185
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
ప్రచుర్ణార్ధం:   "నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం" -...
By Rajini Kumari 2026-01-12 13:59:15 0 127
Andhra Pradesh
దోర్నాల పట్టణం లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ డార్మెంటరీ శంకుస్థాపన
దోర్నాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ డార్మెంటరీ కీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి...
By Chennaiah Kati 2026-01-07 15:56:46 0 272
Andhra Pradesh
Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌  ఈ...
By Pagadala Venkateswar 2026-01-31 06:08:11 0 143
Telangana
మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణం
మనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం...
By Gandla Vaijanath 2026-03-27 08:43:44 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com