Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.

0
142

సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ తల్లి కోరగా, అతనికి ఆటో కొనివ్వమని సీఎం చెప్పారంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

 

ఇటీవల తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన ముక్కర అంబిక ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడ వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకునే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్తకు జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

 

సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎదురింటికి చెందిన మరో మహిళ తన డిగ్రీ చదివిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కొందరు దురుద్దేశంతో అంతకుముందు సీఎం అంబిక భర్తకు ఆటో ఇప్పించాలని ఇచ్చిన ఆదేశాలను, ఈ మహిళ చేసిన అభ్యర్థనకు జతచేసి "చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తారట" అంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 

ఈ వ్యవహారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగంతో పాటు మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. రెండు వేర్వేరు వీడియో క్లిప్పులను కలిపి "కట్ అండ్ పేస్ట్" చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో లోపాలు వెతకలేకే, వైసీపీ ఇలాంటి తప్పుడు వీడియోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని, ప్రజలకు వాస్తవాలు తెలుసని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం :...
By Chennaiah Kati 2026-07-06 01:09:56 0 59
Andhra Pradesh
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...
By Eslavath RameshNaik 2026-01-26 07:47:33 0 499
Telangana
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
By Ponnala Srinivasrao 2026-04-23 03:25:36 0 119
Telangana
సుల్తానాబాద్ : నేటి నుంచి అందుబాటులోకి యూరియా బుకింగ్ యాప్...!
రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు శనివారం నుంచి యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని...
By Sunka Santhosh 2026-06-20 13:25:01 0 130
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com