Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.

0
51

సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ తల్లి కోరగా, అతనికి ఆటో కొనివ్వమని సీఎం చెప్పారంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

 

ఇటీవల తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన ముక్కర అంబిక ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడ వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకునే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్తకు జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

 

సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎదురింటికి చెందిన మరో మహిళ తన డిగ్రీ చదివిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కొందరు దురుద్దేశంతో అంతకుముందు సీఎం అంబిక భర్తకు ఆటో ఇప్పించాలని ఇచ్చిన ఆదేశాలను, ఈ మహిళ చేసిన అభ్యర్థనకు జతచేసి "చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తారట" అంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 

ఈ వ్యవహారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగంతో పాటు మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. రెండు వేర్వేరు వీడియో క్లిప్పులను కలిపి "కట్ అండ్ పేస్ట్" చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో లోపాలు వెతకలేకే, వైసీపీ ఇలాంటి తప్పుడు వీడియోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని, ప్రజలకు వాస్తవాలు తెలుసని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి...
By Mobbu Venkatramana 2026-01-23 11:49:46 0 482
Andhra Pradesh
Chandrababu Naidu: నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు.
కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:35:41 0 92
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 11:11:28 0 74
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల...
By Pagadala Venkateswar 2026-02-02 12:24:16 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com