మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|

0
189

హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కీలక సమస్యలను వివరించారు.

వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, మల్కాజ్‌గిరి పరిధిలో వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్యపై చర్చించారు. సర్వే నంబర్లు 3, 103-105, 144-154 వరకు ఉన్న భూములు చట్టబద్ధమైనవేనని అన్ని ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు.

ఈ భూములు ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందినవని, అయినప్పటికీ 22-A జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

ఈ సర్వే నంబర్లను 22-A నుంచి తొలగించాలని కోరగా, సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ చర్యలతో మల్కాజ్‌గిరి ప్రజల ఆస్తి సమస్యలు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-05 06:17:11 0 178
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 115
Telangana
Telangana Strengthens Urban Infrastructure Development
Telangana continues to enhance urban infrastructure through major investments in road networks,...
By Fathima Safa 2026-06-29 11:36:34 0 55
Haryana
Senior Officials Inspect Digital Infrastructure in Haryana Government Schools
On July 17, the Haryana government deployed senior civil service officers to evaluate the use of...
By Bharat Aawaz 2025-07-17 06:38:08 0 1K
Andhra Pradesh
పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-18 14:50:28 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com