ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్‌ ?

0
234

హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది

‎విజయ్‌కుమార్‌ న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ఢిల్లీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిసింది. అతని ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్‌ చేయడంతోపాటు స్థిర, చరాస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 12 గంటలపాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లడానికి అనుమతినిచ్చారు. అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని అతన్ని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
By Sidhu Maroju 2025-09-03 10:42:41 0 387
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 699
Telangana
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి..Adv మహ్మద్ సద్దాం
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు...
By Ponnala Srinivasrao 2026-06-08 03:42:30 0 119
Andhra Pradesh
లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు
లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు లింగాల మండలం లోపట్నూతల...
By Chennaiah Kati 2026-07-12 13:17:38 0 57
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-04-22 03:05:48 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com