విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా

0
212

Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం

జరగకూడదని భావించిన ఆయన, జీ ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా మహేందర్ అనే ప్రైవేట్ గణిత ఉపాధ్యాయుడిని నియమించారు. నియమించిన ఉపా ధ్యాయుడికి బుధవారం తన సొంత డబ్బులతో గరుగు రాజు వేతనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని, వారికి నాణ్యమైన విద్య అందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ మల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు జులేక సుల్తానా, ఎస్ఎంసి ఛైర్మన్ మహేశ్వరి, నాయకులు చదువు రామచందర్, ఉపాధ్యాయులు రాములు, అరుణ, శైలజ, భాగ్యలక్ష్మి, సుమిత్ర, సుగుణ, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...
By Vadlamudi NagaVenkat 2026-03-05 07:27:56 1 463
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కేతనపల్లెలో మామిడి తోటలో చెలరేగిన మంటలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కేతనపల్లె గ్రామ సమీపంలో మామిడి తోటలో ఆదివారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-23 12:00:01 0 84
Telangana
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న       ...
By Prashanth Goindla 2026-01-12 10:20:31 0 284
Telangana
ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి...
By Sidhu Maroju 2025-12-01 10:42:01 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com