బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ

0
146

*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*

 

*బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన*

 

*నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగానికి నూతన దిశ*

 

*మౌలిక వసతుల మెరుగుదలతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి*

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మంగళగిరి పట్టణంలోని కొత్తపేట ఒకటో వార్డులోని బీఆర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ-1 ఉషా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ‘తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎంఈఓ-2 బాబు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయి బోధన కొనసాగుతోందన్నారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంగినేని శ్రీనివాసరావు, మోడల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి. ఉషా లక్ష్మి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు నాగమణి, ధనలక్ష్మి, అజయ్, మధు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 229
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 71
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 171
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 164
Manipur
Echoes for Peace: Catholic Bodies Appeal for Harmony
Amidst a fresh wave of violence, Catholic lay organizations in the Archdiocese of Imphal issued a...
By Dunna Jessicaruth 2026-05-15 10:25:55 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com