టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్

0
117

*Press Release*

 

*టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*

 

*ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ*

 

*సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ*

 

మంగళగిరి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో తన 0.81 ఎకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన ముత్తే సాంబశివరావు కోరారు. రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని ఏలూరుకు చెందిన నిమ్మల జ్యోతి కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని తమ ఖాళీ స్థలానికి సంబంధించి వేరొక వ్యక్తి పేరుపై అక్రమంగా ఇంటి పన్ను విధించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు పన్నును రద్దుచేసి న్యాయం చేయాలని గూడపాటి కోటేశ్వరరావు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

*****

Search
Categories
Read More
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 1K
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 921
Andhra Pradesh
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ దేశవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:26:53 0 84
Telangana
డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
  సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు...
By Sidhu Maroju 2026-03-12 10:16:13 0 102
Andhra Pradesh
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
By Kothuru Murali 2026-01-28 09:36:18 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com