వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు

0
122

చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ,బి,అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలునిర్వహించారు. తదుపరి వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అన్న విషయాలను పరిశీలించారు.అలాగే ఓవర్ స్పీడ్‌గా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్లు వాహనాలు నడపరాదని స్పష్టంగా హెచ్చరిస్తూ, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదని సూచించారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి మండిపల్లి
ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన...
By Benguluri Madhubabu 2026-01-23 06:10:29 0 206
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 718
Andhra Pradesh
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-01-28 06:19:02 0 82
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com