వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు

0
278

చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ,బి,అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలునిర్వహించారు. తదుపరి వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అన్న విషయాలను పరిశీలించారు.అలాగే ఓవర్ స్పీడ్‌గా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్లు వాహనాలు నడపరాదని స్పష్టంగా హెచ్చరిస్తూ, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదని సూచించారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-02-20 11:31:51 0 120
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 160
Telangana
"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు...
By Sidhu Maroju 2026-04-19 17:49:28 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com