ముస్లిం... మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

0
490

కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు.రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక నవాబుపేట ఈద్గా ప్రార్థన మందిరం వద్ద జరిగిన ముస్లిం మైనారిటీల మత పరమైన ప్రార్ధనలకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వ బరకాతుహ్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనం అందరూ ఒకే దేవుని సృష్టులం, భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలని రంజాన్ పవిత్ర మాసం మనకు సూచిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈ సోదరత్వాన్ని పెంచుతోందని,మతం,కులం, మతపరమైన విభేదాలను మరచి, పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ మహత్తరమైన రంజాన్ పండుగ సందర్భంగా మీతో కలిసి ఆ అల్లాహ్‌ను ప్రార్ధించే అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్‌కు, నా ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కార్యక్రమంలో చీరాల నియోజవర్గ అధికార ప్రతినిధి మహీంద్రానాథ్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
By Bouth Arun 2026-02-11 04:16:41 0 334
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 241
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 64
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 115
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 671
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com