Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.

0
196

 

 

Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

20-03-2026 Fri 19:25 | Andhra

Chandrababu Naidu Reaches Tirumala with Family

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుటుంబసమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు.

 

రేపు శనివారం (మార్చి 21) నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం తరఫున ప్రతి ఏటా కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం, ఈసారి కూడా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించనున్నారు. ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా సమర్పించనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం దర్శనానంతరం తిరిగి బయలుదేరనున్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
    వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-15 09:49:55 0 156
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:27 0 693
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bheeshman King 2025-12-22 16:41:55 0 377
Telangana
Tomorrow medical shops closed
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్   దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి....
By G k Nookala 2026-05-19 12:24:58 0 169
Andhra Pradesh
నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు...
By Patan Khuddus 2026-04-29 15:32:50 0 275
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com