Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.

0
195

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.

 

ముఖ్యంగా శుక్రవారం (మార్చి 20) దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరవచ్చని అప్రమత్తం చేసింది.

 

ఇక ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోనూ శుక్రవారం చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ఈ ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.

 

ఉపరితల ఆవర్తనంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉండటం కూడా ఈ వర్షాలకు కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతల్లో మొదటి మూడు రోజులు పెద్దగా మార్పులు ఉండవని, ఆ తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం: ...
By Rajini Kumari 2025-12-27 10:47:52 0 225
Andhra Pradesh
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు. తాళ్లూరు...
By Chennaiah Kati 2026-06-29 05:39:15 0 48
Telangana
మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది....
By Bonagiri RaviShankar 2026-07-11 05:38:13 0 91
Andhra Pradesh
ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*   విజయవాడ పశ్చిమ ఫిబ్రవరి 21 :...
By Rajini Kumari 2026-02-21 17:11:58 0 141
Andhra Pradesh
Chandrababu Naidu: బీసీసీఐ, ఐసీసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: బీసీసీఐ, ఐసీసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-10 11:49:59 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com