భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్

1
1K

వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ​ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మార్వో జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు
*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*     *విజయవాడ టూ టౌన్ పోలీస్...
By Rajini Kumari 2025-12-25 07:33:32 0 161
Business
ఆర్బీఐ గుడ్‌న్యూస్..? మళ్లీ భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..
RBI Rate Cut: ఆర్బీఐ గత కొంత కాలంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుస...
By Kanva Prasad 2025-06-05 08:42:18 0 3K
Andhra Pradesh
అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఐక్యతే మార్గం: ముఫ్తీ అబ్దుల్ బాసిత్.
గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర...
By John Baji 2026-01-06 12:38:30 0 177
Andhra Pradesh
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
By Benguluri Madhubabu 2026-03-15 10:34:26 0 172
Andhra Pradesh
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని...
By Rajini Kumari 2025-12-19 10:30:44 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com