పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|

0
126

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బిజెపి నాయకులు దండా నిర్వహించారు.  అనంతరం అల్వాల్ లోని సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. 

అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య–వితంతు–దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా వంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని బీజేపీ నాయకులు అన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పేదల కోసం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కూడా ఇప్పటికీ అమలు కాకపోవడంతో అనేక కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఇక జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 126
Andhra Pradesh
ఇంటిగ్రిటీ నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఐజిపి ఏపీ ఈగల్ చీఫ్
🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*. -...
By KOTESWARARAO KVSR 2025-12-22 16:46:52 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com