పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|

0
192

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బిజెపి నాయకులు దండా నిర్వహించారు.  అనంతరం అల్వాల్ లోని సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. 

అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య–వితంతు–దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా వంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని బీజేపీ నాయకులు అన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ల కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పేదల కోసం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కూడా ఇప్పటికీ అమలు కాకపోవడంతో అనేక కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఇక జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నాయకులు హెచ్చరించారు.

అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
West Bengal
Taratala Warehouse Collapse Sparks Safety Review in Kolkata
A tragic warehouse collapse in Kolkata's Taratala area has resulted in multiple fatalities and...
By Navya Sree 2026-06-26 06:04:44 0 35
Andhra Pradesh
మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ...
By Pagadala Venkateswar 2026-06-30 07:12:47 0 63
Andhra Pradesh
బుద్ధునికొండపై నిషేధాజ్ఞలు తొలగించాలి: సీఎంకు వినతి.
మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని...
By Pagadala Venkateswar 2026-03-10 04:42:04 0 145
Andhra Pradesh
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని...
By Chennaiah Kati 2026-02-03 18:07:28 0 206
Uttarkhand
Uttarakhand Strengthens Agriculture and Horticulture
Uttarakhand continues to strengthen its agriculture and horticulture sectors through initiatives...
By Fathima Safa 2026-06-27 07:40:36 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com