ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
98

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి చర్చించారు. 

ఈ సందర్భంగా కాలనీలలో పెరుగుతున్న దోమల సమస్యపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

పలు కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. 

ముఖ్యంగా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అదే విధంగా చీకటి ప్రాంతాల్లో ప్రజల భద్రత దృష్ట్యా కొత్త వీధి దీపాలు మరియు వాటికి అవసరమైన పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

భీమ్‌రావ్ నగర్, వాసవి నగర్ ప్రాంతాల్లో ఉన్న పార్కులను రక్షించేందుకు చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. 

దీంతో పార్కుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు ప్రజా ఆస్తి రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.

అవసరాల దృష్ట్యా కొత్త అంతర్గత రహదారులు మంజూరు చేయాలని, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ జోనల్ కమిషనర్‌కు అధికారిక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.

ఈ అంశాలపై జోనల్ కమిషనర్ సంచిత్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 207
Nagaland
Tribes Resume Sit-In Protest Over 48-Year-Old Reservation Policy
The Nagaland Cabinet has approved the Nagaland Youth Policy 2025, aiming to empower the...
By Bharat Aawaz 2025-07-17 11:06:31 0 1K
Andhra Pradesh
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
By Rajini Kumari 2026-04-02 16:40:00 0 79
Andhra Pradesh
పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో...
By Kothuru Murali 2026-01-07 13:11:36 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com