అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్

0
131

*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*

 

అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం, ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోంది. అధునాతన సాంకేతికలతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బిట్స్ ప్రతినిధులు తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Youth Unite for Harmony and Growth |
Three major youth organizations in Arunachal Pradesh have united to promote communal harmony and...
By Pooja Patil 2025-09-15 06:41:34 0 205
Telangana
నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు...
By Sadaq Sadaq 2026-04-07 17:48:03 0 146
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 89
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
By Avunoori Mahesh 2026-04-09 04:38:47 0 195
Telangana
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-11-26 07:49:05 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com