ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శా

0
157

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 13, 2026*

 

*మొల్ల‌మాంబ జీవితం అందరికీ ఆద‌ర్శ‌నీయం..*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

తొలి తెలుగు క‌వ‌యిత్రి మొల్లమాంబ జీవితం అంద‌రికీ ఆదర్శ‌నీయ‌మ‌ని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ర‌చించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ‌మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి మొల్ల‌మాంబ చిత్రపటానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మొల్ల‌మాంబ సాహిత్య సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. మొల్ల రామాయణం నేటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన, తేట తెలుగు కావ్యాలలో ఒకటిగా నిలిచిపోయిందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, బీసీ సంక్షేమం, వివిధ శాఖ‌ల అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్...
By Kothuru Murali 2026-05-20 16:17:36 0 32
Andhra Pradesh
నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని...
By Boiena Rajesh 2026-05-01 10:19:44 0 140
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం...
By Gitta Raju 2026-04-17 11:50:54 0 112
Telangana
గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!
బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన.... భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం ఖానాపురం...
By Gujile Ramu 2026-05-15 06:18:04 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com