ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శా

0
156

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 13, 2026*

 

*మొల్ల‌మాంబ జీవితం అందరికీ ఆద‌ర్శ‌నీయం..*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

తొలి తెలుగు క‌వ‌యిత్రి మొల్లమాంబ జీవితం అంద‌రికీ ఆదర్శ‌నీయ‌మ‌ని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ర‌చించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ‌మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి మొల్ల‌మాంబ చిత్రపటానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మొల్ల‌మాంబ సాహిత్య సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. మొల్ల రామాయణం నేటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన, తేట తెలుగు కావ్యాలలో ఒకటిగా నిలిచిపోయిందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, బీసీ సంక్షేమం, వివిధ శాఖ‌ల అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 128
Andhra Pradesh
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
By Pagadala Venkateswar 2026-01-06 07:43:30 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com