ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

0
100

ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు' 

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

గొల్లపూడిలో 50 అర్జీలు సమర్పణ.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 13.03.2026.

 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు 'ప్రజాదర్బారు' కార్యక్రమ నిర్వహణ దర్పణం పడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బారు) నిర్వహించారు. మొత్తం 50 మంది ఆర్జీలు సమర్పించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్ష‌న్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు, వివిధ రెవెన్యూ సేవ‌లు, పోలీసు సేవలకు సంబంధించి అర్జీలు వ‌చ్చాయి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

 

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

 

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు, మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. 

 

ప్రజదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్‌ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:54:09 0 186
Andhra Pradesh
సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యం టిడిపి మండల కన్వీనర్ సురేష్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల...
By mahaboob basha 2025-10-04 15:31:09 0 303
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 214
Tamilnadu
Tirupur's Textile Industry Turns to Synthetic Fibers, Eyes Export Boom
Tirupur, Tamil Nadu’s leading textile hub, is undergoing a major transformation....
By Bharat Aawaz 2025-07-28 12:01:25 0 970
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com