ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

0
166

ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు' 

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

గొల్లపూడిలో 50 అర్జీలు సమర్పణ.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 13.03.2026.

 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు 'ప్రజాదర్బారు' కార్యక్రమ నిర్వహణ దర్పణం పడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బారు) నిర్వహించారు. మొత్తం 50 మంది ఆర్జీలు సమర్పించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్ష‌న్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు, వివిధ రెవెన్యూ సేవ‌లు, పోలీసు సేవలకు సంబంధించి అర్జీలు వ‌చ్చాయి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

 

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

 

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు, మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. 

 

ప్రజదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్  గారికి జన్మదిన...
By Sadaq Sadaq 2026-05-01 09:14:22 0 139
Business & Finance
Is Your Organization Safe with Digital Signatures
Digital signatures help organizations protect important documents by verifying authenticity and...
By Navya Sree 2026-07-17 07:21:35 0 40
Meghalaya
Meghalaya Advances Women Empowerment Initiatives
Meghalaya continues to strengthen women's empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-03 16:18:55 0 77
Andhra Pradesh
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
By Jeeru Kumar 2026-03-02 11:17:23 0 1K
Andhra Pradesh
మదనపల్లె బస్టాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పర్సు చోరీ.
మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం చిత్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖదీర్...
By Pagadala Venkateswar 2026-03-07 04:53:02 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com