అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|

0
180

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

2024లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.జి. నారాయణ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు క్రైమ్ నంబర్ 275/2024 కింద ఐపిసి సెక్షన్లు 376(2)(d), 376(3) మరియు పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణను చేపట్టిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ , ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు నారాయణను దోషిగా నిర్ధారించారు. 

దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు.

అలాగే, బాధితురాలికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. 

ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ లోతుగా దర్యాప్తు చేయగా, అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ప్రశాంత్ కేసు పురోగతిని పర్యవేక్షించారు. 

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ పి. ఉప చారి సాక్షుల హాజరు, కోర్టు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక హెచ్చరిక అని పోలీసు అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Business & Finance
Wind Up an LLP with a Simple Legal Exit Process
Winding up an LLP (Limited Liability Partnership) is the legal process of closing the business...
By Navya Sree 2026-07-10 05:35:48 0 57
Karnataka
Bengaluru Sees Sharp Rise in Human Rights Complaints
Banagalore- Karnataka - In the last two years, Bengaluru Urban has recorded a staggering 3,537...
By Citizen Rights Council 2025-08-11 10:43:05 0 3K
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 467
Andhra Pradesh
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*  ...
By Rajini Kumari 2025-12-26 09:55:55 0 333
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com