మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు

0
220

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా  నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు అప్పజెప్పారు .అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది .తమకిచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో ఛేదించేందుకు టీడీపీ నేతలు పోటీలు పడి మొక్కలు నాటుతున్నారు .అందులో భాగంగానే 15 వ డివిజన్ లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు .డివిజన్ ఇంచార్జ్ కెపి చౌదరి,డివిజన్ నేత దశరధ రామయ్య లు మాట్లాడుతూ 
నెల్లూరును ఒక మోడల్ గ్రీన్  సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీ ఐదు మీటర్లకు ఒక చెట్టు  నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం , పచ్చదనంతో నిండిన పర్యావరణం  ప్రజలకు  ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీలో ఉండే 28 డివిజన్లో  చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు  .
అందులో భాగంగా ఈరోజు 15 డివిజన్లో మొదలుపెట్టామని  వారంలో పూర్తి చేస్తామన్నారు . 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ,యూనిట్ ఇన్ చార్జీలు ,డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 159
Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్‌కు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు.
లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం  పాఠశాలల్లో మౌలిక వసతులు,...
By Pagadala Venkateswar 2026-01-23 05:49:46 0 123
Telangana
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని...
By Prashanth Goindla 2026-02-02 17:50:54 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com