దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు

0
360

దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత నాయకులు మార్కాపురం జిల్లాలో దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసుల రిలీఫ్ ఫైల్ పరిష్కరించాలని మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులను మంగళవారం దళిత నాయకులు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో మరికొందరు దళిత నాయకులు కలసి విజ్ఞప్తి చేశారు. మార్కాపురంలోని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు నివసిస్తున్న అపార్ట్మెంట్లో కలసి దళితుల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు కమిటీ జీవోలను అమలు చేయవలసి ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో దళితుల భూములను ఇతరులు ఆక్రమించిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చిన భూములలో కూడా ఇతర కులాలవారు ఆక్రమించి అమ్ముకుంటున్నారన్నారు. మార్కాపురం జిల్లాలో ఎక్కువ అటవీ ప్రాంతం అయినప్పటికీ దళితులకు స్మశాన భూములు కూడా లేవన్నారు. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుతొ భూముల రేట్లు కు వచ్చాయన్నారు. దళితుల భూములు ఆక్రమణలు జరిగిన పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెడితే తహసిల్దార్ నుంచి రిపోర్టు వస్తేనే కేసు కడతాము అంటున్నారు. GOMS NO1235 ప్రకారం స్మశాన భూములు లేని ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ భూములైన కేటాయించాలి లేదా మార్కర్ రేటు చెల్లించి చాన భూమిని కొనివ్వాలన్నారు. మార్కాపురం జిల్లాలో దళితుల పట్టా భూములు ఆక్రమణలపై 9/77 యాక్ట్ అమలు చేసి భూములు అమ్ముకున్న ఎస్సీ ఎస్టీలకు తిరిగి భూములు ఇప్పించాలన్నారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఇతరులపై ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అలాగే బేస్తవారి పేట పోలీస్ స్టేషన్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు రోజే హత్యకు గురైన జయంపు కృష్ణయ్య కేసులో మార్కాపురం డి.ఎస్.పి కోర్టులో షార్ట్ సీటు ఫైల్ చేశారు. కావున బాధిత కుటుంబానికి ఈ ఎస్ టి యానాది కులస్తుని హత్య కేసులో బంధువులకు రిలీఫ్ ఎస్సీ ఎస్టీ మంత్లీ పెన్షన్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు రిపోర్టులు తెప్పించాలని మార్కాపురం జెసి పులి శ్రీనివాసకు హత్యకు గురైన జయంబు కృష్ణయ్య సార్ సీట్ కాపీని అందించారు. అలాగే పూర్వపు మార్కాపురం డివిజన్లో ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైన దాడులకు గురైన కలెక్టరేట్ వారికి సంబంధిత తహసిల్దార్లు రిపోర్టులు పంపకుండా అలసత్వం వహించే వారన్నారు. నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు రిలీఫ్ ఇవ్వటానికి తహసిల్దార్లు వెంటనే రిపోర్టులు పంపని తహసీల్దారులపై ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ 3(2) V11 విక్కనైజేషన్ ఎట్ దా హాండ్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ప్రకారం కేసులు నమోదు చేయించాలన్నారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య , కాకుమాను రవి, పట్రా బంగారం, వీసీకే పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి రాజు తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వారం రోజులు వాయిదా....
హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్ర మంత్రి భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున బండి సంజయ్ కుమారుడు బండి...
By Gujile Ramu 2026-05-14 11:30:45 0 105
SURAKSHA
Dr. D. Manikandan, IAS: Driving Progress Through Service
A dedicated IAS officer of the AGMUT cadre, Dr. D. Manikandan has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 05:13:30 0 34
Business & Finance
Working Capital Keeps Your Business Running Smoothly
Working capital is the money a business uses to manage its day-to-day operations, including...
By Navya Sree 2026-07-20 05:51:38 0 23
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 172
Andhra Pradesh
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య...
By Manda Ramkumar 2026-03-29 00:18:09 0 376
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com