ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు

0
172

విజయవాడ

09-03-2026

 

ప్రచురణార్ధం

 

భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు

 

పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా 

 

స్థానిక భవానీపురంలోని స్వాతి ధియేటర్ వద్ద గల రజ మసీద్ నందు సోమవారం నాడు ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు మసీద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఘనంగా నిర్వహించబడింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రివర్యులు మరియు విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా హాజరయ్యారు. ముందుగా వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు 

 

ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు రఫీ, జి ఎంసి బాషా, రసూల్, గౌస్, బక్షు, సాదిక్, ఖలీం, ఉస్మాన్, పార్టీ నాయకులు షేక్ హయత్, రెహమాన్, ఇషాక్, బడేమియ మరియు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి...
By Kothuru Murali 2026-05-01 12:27:14 0 106
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ.
  సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం...
By Pagadala Venkateswar 2026-05-30 05:21:51 0 80
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 176
Goa
Goa Congress Opposes Ports Terminal Inauguration
The Goa Congress has opposed the scheduled inauguration of the new Captain of Ports terminal,...
By Navya Sree 2026-06-25 08:40:30 0 129
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 13:22:56 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com