ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ
09-03-2026
ప్రచురణార్ధం
భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు
పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా
స్థానిక భవానీపురంలోని స్వాతి ధియేటర్ వద్ద గల రజ మసీద్ నందు సోమవారం నాడు ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు మసీద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రివర్యులు మరియు విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా హాజరయ్యారు. ముందుగా వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు రఫీ, జి ఎంసి బాషా, రసూల్, గౌస్, బక్షు, సాదిక్, ఖలీం, ఉస్మాన్, పార్టీ నాయకులు షేక్ హయత్, రెహమాన్, ఇషాక్, బడేమియ మరియు తదితరులు పాల్గొన్నారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz