నాగులపాలెం వద్ద స్కూల్ రహదారి మూసివేతపై ఆందోళన – సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్

0
417

బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి–167 పనుల నేపథ్యంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లే రహదారిని మూసివేయడం సరైన చర్య కాదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
నాగులపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు రోజువారీ రాకపోకలకు ఈ రహదారిని వినియోగిస్తున్నారు. అయితే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదా డైవర్షన్ ఏర్పాటు చేయకుండా రహదారిని మూసివేయడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు, గ్రామ ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.
అధికారులు తక్షణమే స్పందించి నాగులపాలెం వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి ఆ రహదారిని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుతో కలిపి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి పరిష్కారం చూపాలని, అలాగే పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే...
By Vadlamudi NagaVenkat 2026-04-25 12:41:01 0 249
Andhra Pradesh
గల్ఫ్" దేశాలకు వెళ్ళే ప్రవాసుల అవసరాన్ని అవకాశవాదం గా మార్చుకొని ఆంధ్రప్రదేశ్,కడప జిల్లాలో రెచ్చిపోతున్న గల్ఫ్ మెడికల్ మాఫీయా, ట్రావెల్స్ ఏజంట్లు.
ఒక రోజుకు కొన్ని కోట్ల,లక్షల రూపాయలు వసూలు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా మెడికల్ మాఫీయా ట్రావెల్స్...
By John Baji 2026-01-06 13:39:53 0 219
Telangana
రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు...
By Ponnala Srinivasrao 2026-05-06 04:05:40 0 131
Telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
By Gandla Vaijanath 2026-07-04 05:15:34 0 70
Andhra Pradesh
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
By Boiena Rajesh 2026-04-01 00:39:34 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com