YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.

0
153

Andhra

 

YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP

జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల

జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ

కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని విమర్శ

 

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. 

 

 

రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ... ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు.

Search
Categories
Read More
SURAKSHA
​Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
By Kalaga Sailaja 2026-07-11 10:26:04 0 57
Andhra Pradesh
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ  12-01-2026   ప్రచురణార్ధం   దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...
By Rajini Kumari 2026-01-12 13:15:41 0 205
Andhra Pradesh
పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు...
By Kothuru Murali 2026-03-06 11:48:03 0 153
Andhra Pradesh
సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే 11 స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్...
By Karapati Gopi 2025-12-30 10:25:37 0 614
Andhra Pradesh
పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
By Kothuru Murali 2026-07-09 11:34:39 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com