*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*

0
832

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మరియు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం మరియు మహిళామణులకు అభినందనల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు శ్రీమంతపు కిట్లు అందజేసి ఆశీర్వదిస్తున్న బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.  

ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, మహిళలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియ జేశారు. మహిళా దినోత్సవం అంటే కేవలం అభినందనలు తెలుపుకోవటం మాత్రమే కాదు అని, మహిళల అభివృద్ధికి పాటు పడుతూ, మహిళలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి అని తెలియ జేశారు. ప్రపంచ జీవనాడికి మూల కేంద్రమైన మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ మహిళా సాధికారత కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియ జేశారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు గా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు మరియు వారి టీమ్ సభ్యులు అందరూ సమాజ సేవా కార్యక్రమాలతో పాటు మహిళలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అద్భుతంగా స్పందించటం, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యునిగా తాండ్ర సాంబశివరావు సంతోషాన్ని వ్యక్త పరిచారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల ఎమ్మార్వో సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారులు, బాపట్ల డి.ఎస్.పి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు శేష కుమారి, నాగమల్లీశ్వరి, శైలజ, అంగన్వాడి కార్యకర్తలు, బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ టీమ్ సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 278
Andhra Pradesh
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*   *అమరావతి*    *రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
By Rajini Kumari 2026-01-29 13:38:48 0 171
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:51 0 108
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
By Avunoori Mahesh 2026-04-09 04:38:47 0 195
Telangana
ప్రారంభోత్సవ కార్యక్రమం
140 డివిజన్ నుండి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-07 08:59:39 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com