*అఖిల భారత యాదవ మహాసభ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు కొండయ్య.

0
779

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య..ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యా బోధన అందివ్వాలని యాదవుల స్థితిగతులు మారాలంటే కేవలం విద్యతోనే ముడిపడి ఉంటుందని అదేవిధంగా పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను రాబోవు తరాలకు గుర్తుండే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలని ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలను విద్యాభ్యాసం మరియు ఆరోగ్యంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యాదవ కులస్తులు విద్య వైద్య వ్యాపార రాజకీయ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయికి చేరాలన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న జాతియా యాదవ సంఘం అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మహేష్ యాదవ్,రాష్ట్ర యాదవ సంగం అధ్యక్షుడు లాక వెంగల రావు యాదవ్, జాతియా యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ,శ్రీసత్యసాయి జిల్లా యాదవ్ సంగం అధ్యక్షుడు లక్ష్మి నరసప్ప, రాష్ట్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి అడ్వాకెట్ గుండుమల రాధాకృష్ణ,జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహా యాదవ్,రాష్ట్ర మొత్తం యాదవ సంఘం అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com