India act responsibly said U S TREASURY SECRETARY

0
113

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.

 

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

Scott Bessent

 

 ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. స్కాట్‌ ఈ విధంగా స్పందించారు.

 

'ప్రపంచ దేశాలకు చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మిత్ర దేశమైన భారత్‌కు అమెరికా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది' అని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో 'భారత్‌ చాలా బాధ్యతగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్‌ ఆపివేసింది. ఆ తర్వాత అమెరికా నుంచి చమురు కొనాలని భారత్‌ నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరాలో తాత్కాలికంగా లోటు ఏర్పడింది. దాన్ని భర్తీ చేసేందుకు రష్యా చమురును కొనేందుకు మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం. త్వరలోనే రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు' అని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్కాట్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
By Boiena Rajesh 2026-03-05 14:45:24 0 164
Andhra Pradesh
కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం
విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా     ...
By Mobbu Venkatramana 2026-03-06 12:16:52 0 372
Andhra Pradesh
Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు.
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లు...
By Pagadala Venkateswar 2026-02-21 04:38:33 0 205
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 108
Telangana
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి .
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి  ‎ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:17:37 1 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com