‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

0
311

ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి ఆర్ పి ఎస్‌.ఐ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ఫారాలు, రైళ్లలో ప్రయాణికుల సామానులను అనుమానాస్పద వ్యక్తులపై, వస్తువులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణపై అవగాహన కల్పిస్తూ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించబడింది.గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ప్రజలు కూడా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి...
By Benguluri Madhubabu 2026-04-02 06:18:54 0 153
Andhra Pradesh
మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు...
By Pagadala Venkateswar 2026-04-30 04:22:19 0 59
Andhra Pradesh
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం   నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
By Pagadala Venkateswar 2026-01-31 10:31:28 0 303
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com