*చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*

0
512

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం 'ఓపెన్ హౌస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఐ ఎస్. సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పోలీస్ స్టేషన్ పనితీరు,ప్రజలకు పోలీసులు అందించే సేవలను క్షేత్రస్థాయిలో వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను చూపిస్తూ, ఫిర్యాదు ఎలా చేయాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు.ఆపద సమయంలో భయం వీడి పోలీసులను ఎలా ఆశ్రయించాలో తెలియజేస్తూ, మహిళలు మరియు బాలికల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.అంతేకాకుండా, స్టేషన్‌లో అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ పరికరాలు,రికార్డులు,ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రయోగాత్మక వివరణ ఇచ్చారు.పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న అపోహలను తొలగించి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడమే ఈ ఓపెన్ హౌస్ ప్రధాన ఉద్దేశమని సిఐ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా...
By Gadiyapudi Narendra 2026-02-11 17:01:04 0 191
Andhra Pradesh
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....
By Boiena Rajesh 2026-02-27 02:11:53 0 178
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:43:56 0 195
Andhra Pradesh
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో...
By John Baji 2025-12-25 06:16:18 0 213
Andhra Pradesh
బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా...
By Boya Dasthagiri 2026-04-02 23:56:04 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com