తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|

0
95

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.

ఏఐసీసీ (AICC) వెల్లడించిన వివరాల ప్రకారం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. 

నామినేషన్ల దాఖలుకు నిర్ణీత గడువు ఉండటంతో, అభ్యర్థులు ఇద్దరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

జాతీయ రాజకీయాల్లో సింఘ్వీకున్న అనుభవం, చట్టసభల్లో ఆయన గొంతుక పార్టీకి అవసరమని భావించిన హైకమాండ్, ఆయనకు అవకాశం కల్పించింది. మరోవైపు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వేం నరేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదన మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

తమను రాజ్యసభ అభ్యర్తులుగా ఎంపిక చేసినందుకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

#sidhumaroju

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన చిన్నారాయల్
జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:31:45 0 101
Andhra Pradesh
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు సిటీ : పాణ్యం కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్...
By Hari Krishna 2026-01-26 08:40:02 0 268
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com