AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.

0
127

ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను కేటాయించనుంది. 

 

ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 46 వేల మందికి పైగా రైతులకు వ్యవసాయ పనులకు విద్యుత్ సౌకర్యం అందనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*   ...
By Rajini Kumari 2026-01-28 13:05:12 0 148
Telangana
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
By Sidhu Maroju 2025-10-23 14:22:13 0 254
Telangana
మంగాపురం తండాలో నీటి సమస్యకు సర్పంచ్ పరిష్కారం...
పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Krishna Balina 2026-02-23 09:20:25 0 226
Andhra Pradesh
Renew global energy inauguration
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో...
By G k Nookala 2026-04-23 04:58:38 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com