Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.

0
103

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం

వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు నిమ్మల, పయ్యావుల వెల్లడి

సీమకు ఐదేళ్లలో జగన్ చేసిందేమీ లేదని, ఆయనో రాయలసీమ ద్రోహి అని విమర్శ

తమ ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామన్న మంత్రులు

ఎన్జీటీ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు

 

శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (రాయలసీమ లిఫ్ట్) అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏంటని కూటమి ప్రభుత్వ మంత్రులు వైసీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు ఆగిపోయిన పనులకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లడమేంటని నిలదీశారు.

 

ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. "రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలతో ఆగిపోయాయి. ఈ విషయాన్ని నాటి తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్వయంగా ప్రకటించారు. అలాంటప్పుడు, నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించింది మీ అసమర్థత కాదా?" అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి కారణమైన జగన్ రెడ్డి ఓ రాయలసీమ ద్రోహి అని వారు అభివర్ణించారు.

 

తమ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. "రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో వైసీపీ ప్రభుత్వం సీమకు 1 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. కానీ, మేం హంద్రీనీవా పనులు పూర్తి చేసి 190 రోజుల్లోనే 44 టీఎంసీల నీటిని తరలించాం. ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టుల్లో 366 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ఇది మా నాయకుడు చంద్రబాబు సమర్థతకు నిదర్శనం" అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 20 నెలల్లోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని, తాజా బడ్జెట్‌లో మరో రూ.10,014 కోట్లు కేటాయించిందని వివరించారు.

 

వైసీపీ ప్రభుత్వం జీఓ 365 తెచ్చి 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిందని, గోరుకల్లు, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించిందని మంత్రులు ఆరోపించారు. "మీ దరిద్రపు పాలనలో, మీ అసమర్థ నాయకుడి చేతకానితనం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. ఆ నిజాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఒక యజ్ఞంలా పనిచేస్తుంటే, వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు" అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో నిలిచిపోయిన పనులకు మమ్మల్ని బాధ్యులను చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని వారు హితవు పలికారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-20 09:40:25 0 135
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 2K
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 141
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com