Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.

0
101

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం

చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు

వీర్రాజుపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులు

 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే, మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేనురాజు... తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా... వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

 

 

తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా, ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి, వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్ మోషేనురాజు సభను రేపటికి వాయిదా వేశారు.

Search
Categories
Read More
Telangana
*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో...
By Bouth Arun 2025-12-26 06:58:00 0 459
Andhra Pradesh
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-11 06:38:45 0 77
Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభం
హైదరాబాద్‌:ఇక ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు తెలంగాణ...
By Vadla Egonda 2025-06-11 16:05:24 0 2K
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం...
By Kothuru Murali 2026-01-24 07:48:46 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com