Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.

0
84

Andhra

Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈ ఘటనలో నలుగురు మృతి, 13 మందికి పైగా అస్వస్థత

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

ల్యాబ్ రిపోర్టుల తర్వాత నిందితులపై కఠిన చర్యలని స్పష్టం

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

 

రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, 13 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చాలామంది కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో (అనూరియా) బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాలు సరఫరా చేసిన కొరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే విక్రేతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 106 కుటుంబాలపై సర్వే చేపట్టారు. 75 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలతో పాటు, పాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం విశాఖపట్నం ల్యాబ్‌కు పంపారు. ఈ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అమరావతి*   *ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని...
By Rajini Kumari 2025-12-23 09:39:15 0 258
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు
*విజయవాడ నగరపాలక సంస్థ* *14-12-2025*     *అనుమతి లేని నిర్మాణాలు తొలగింపు*  ...
By Rajini Kumari 2025-12-15 11:12:11 0 210
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు...
By Pagadala Venkateswar 2026-01-15 11:30:01 0 134
Andhra Pradesh
శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి...
By Manda Ramkumar 2026-03-28 12:37:36 0 118
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com